న్యూఢిల్లీ, జూలై 23: కొవిడ్-19 సంక్షోభం నేపథ్యంలో వాతావరణంలో గాలి నాణ్యత పడిపోయిన ప్రాంతాల్లో బాణసంచాను కాల్చడం, విక్రయించడంపై నిషేధం విధిస్తూ నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు తెలిపింది. వాయుకాలుష్యానికి టపాసులు కాల్చడం ప్రధాన కారణం కాదంటూ ఐఐటీ కాన్పూర్ ఇచ్చినట్టు చెబుతున్న ఓ నివేదికను ఉటంకిస్తూ దాఖలైన ఓ పిటిషన్ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.