హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన కొండపోచమ్మ సాగర్ నుంచి సంగారెడ్డి కాల్వకు నీటిని విడుదల చేయనున్నారు.
వర్గల్ నవోదయ వద్ద కాల్వలోకి సీఎం నీటిని వదలనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
పోలీసులూ పటిష్ట బందోబస్తు ఏర్పాట్లపై దృష్టిపెట్టారు. సంగారెడ్డి కాల్వకు నీటి విడుదలపై స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి