సత్తాచాటిన తెలంగాణ రాష్ట్రం
25లోగా రేషన్కార్డు దరఖాస్తుల పరిశీలన: మంత్రి గంగుల కమలాకర్
హైదరాబాద్/ కరీంనగర్, జూన్ 18(నమస్తే తెలంగాణ): రికార్డుస్థాయిలో ధాన్యం కొనుగోలు చేసి తెలంగాణ సత్తా చాటిందని పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్లు, కొత్త రేషన్కార్డుల జారీపై శుక్రవారం కరీంనగర్లోని వీడియోకాన్ఫరెన్స్లో సమీక్షించారు. యాసంగిలో ఏకంగా 90 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు వెల్లడించారు. కరోనా కష్టకాలంలో రైతుకు ఇబ్బందిలేకుండా సీఎం కేసీఆర్.. రూ.17 వేల కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేశారని తెలిపారు. కొత్త రేషన్కార్డుల దరఖాస్తుల పరిశీలనకు మార్గదర్శకాలు జారీ చేశామని, 25వ తేదీలోపు పరిశీలన పూర్తిచేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 1,454 చౌకధరల దుకాణాలకు డీలర్లు లేరని, త్వరలో భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రేషన్ డీలర్ల సంఘాలన్నీ జేఏసీగా ఏర్పడిన సందర్భంగా శుక్రవారం కరీంనగర్ కలెక్టరేట్లో మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా రేషన్ డీలర్లకు రూ.38 కోట్ల కమీషన్ చెకును మంత్రి అందించారు.