పట్నా: దేశంలో పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం ప్రజల నడ్డి విరుస్తున్నదని ఆర్జేడీ కీలక నాయకుడు తేజస్వియాదవ్ వ్యాఖ్యానించారు. ద్రవ్యోల్బణం కారణంగా ధరలు అంతకంతకే పెరిగిపోతున్నాయని, దాంతో నిరుపేద కుటుంబాల వాళ్లు ఆకలితో చనిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ఇంత జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని అదుపు చేస్తామని చెబూతూ వస్తున్నదే తప్ప, చేతల్లో అదేమీ కనిపించడంలేదని విమర్శించారు.
దేశంలో ఇంధన ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, అయినా కేంద్ర, రాష్ట్రాల్లో అధికార పార్టీల నేతలు నోరు మెదపడం లేదని తేజస్వియాదవ్ మండిపడ్డారు. అందుకే ఇంధన ధరల పెంపును నిరసిస్తూ తాము ఇవాళ బీహార్లోని అన్ని ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించతలపెట్టామని ఆయన వెల్లడించారు.