ముంబై: మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ మంగళవారం సుప్రీంకోర్టుకు వెళ్లారు. తనపై బాంబే హైకోర్టు ఆదేశించిన సీబీఐ విచారణను రద్దు చేయాలని ఆయన కోరారు. ముంబై మాజీ కమిషనర్ పరమ్ బీర్ సింగ్ వేసిన పిటిషన్ మేరకు అనిల్పై వచ్చిన ఆరోపణలపై బాంబే హైకోర్టు సోమవారం సీబీఐ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఆ వెంటనే ఆయన తన పదవికి రాజీనామా చేశారు.
అనిల్ దేశ్ముఖ్పై ప్రాథమిక విచారణ ప్రారంభించడానికి మంగళవారమే సీబీఐ బృందం ముంబై చేరుకోనుంది. ఈ నేపథ్యంలో విచారణను ఆపాలంటూ ఆయన సుప్రీంకోర్టు గడప తొక్కడం గమనార్హం. ముకేశ్ అంబానీ ఇంటి ముందు పేలుడు పదార్థాలు ఉన్న కారును పార్క్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీస్ అధికారి సచిన్ వాజేతోపాటు ఇతర అధికారులను నెలకు రూ.100 కోట్లు వసూళ్లు చేసి ఇవ్వాల్సిందిగా అనిల్ దేశ్ముఖ్ ఆదేశించారని పరమ్ బీర్ ఆరోపించిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి
ధోనీ హెలికాప్టర్ షాట్ చాక్లెట్లు వచ్చేశాయ్!
కొవిడ్ నుంచి కోలుకోగానే లాంబోర్గిని కారు కొన్న హీరో
ఇండియాలో ఏప్రిల్ 15 వరకూ 50 వేల మరణాలు.. అంతా ఉత్తదే అన్న డబ్ల్యూహెచ్వో
బాక్స్ క్రికెట్ ఆడిన పంత్, అశ్విన్, రహానే.. వీడియో
నేను ప్రెగ్నెంట్ అని తెలిసి అతన్ని పెళ్లి చేసుకోలేదు: దియా మీర్జా
వాంఖడే స్టేడియంలో మరో ముగ్గురికి కరోనా
మనుషుల నుంచి పిల్లులు, కుక్కలకు కరోనా: డబ్ల్యూహెచ్వో
ఇండియాపై నిషేధం.. పాకిస్థాన్లో వందకు చేరిన కిలో చక్కెర
కొవిషీల్డ్ రెండో డోసు రెండున్నర నెలల తర్వాత ఇస్తే 90 శాతం సమర్థవంతం
యోగి ఆదిత్యనాథ్, అమిత్ షాలను చంపేస్తాం.. సీఆర్పీఎఫ్కు మెయిల్