కోల్కతా: పశ్చిమబెంగాల్లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలోని భంగార్ ఏరియాలో గత రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. చట్టవ్యతిరేకంగా నడుపుతున్న ఒక లెదర్ ఫ్యాక్టరీలో గ్యాస్ సిలిండర్ పేలి 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. దాంతో వారిని నల్మూరి బ్లాక్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం కోల్కతాలోని ఆస్పత్రికి తరలించారు.
అక్రమంగా నడుపుతున్న లెదర్ ఫ్యాక్టరీలోని బాయిలర్లో దొంగతనంగా ఎరువులు తయారు చేస్తుండగా గ్యాస్ సిలిండర్ పేలిందని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నామని, అక్రమంగా నడుపుతున్న లెదర్ ఫ్యాక్టరీకి సీల్ వేశామని చెప్పారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
ఉత్తరాఖండ్లో హిమపాతం.. ఎనిమిది మంది దుర్మరణం
ఎస్ఐని హతమార్చిన మావోయిస్టులు
కరోనా విధుల్లో కానిస్టేబుల్.. పోలీస్ స్టేషన్లోనే హల్దీ వేడుక
పంది తల, చేప చర్మం.. ఒడిశాలో వింత శిశువు జననం..!
కరోనా కల్లోలం: పేద ప్రజలకు కేంద్రం తీపి కబురు..