చండీగఢ్: పంజాబ్లో మాదకద్రవ్యాల అమ్మకాలకు వ్యతిరేంగా బీజేపీ యువ మోర్చా చేపట్టిన ఆందోళన.. పోలీసులకు, నిరసనకారులకు మధ్య ఘర్షణలకు దారితీసింది. పంజాబ్లో మాదకద్రవ్యాలను విచ్చలవిడిగా అమ్ముతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఈ మధ్యాహ్నం బీజేపీ యువ మోర్చా నాయకులు, కార్యకర్తలు.. చండీగఢ్లోని ముఖ్యమంత్రి అమరీందర్సింగ్ నివాసం ముందు ఆందోళనకు దిగారు.
ఈ సందర్భంగా ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయినా ఆందోళనకారులు బెదరకపోవడంతో లాఠీచార్జి చేశారు. వాటర్ క్యానన్లను ప్రయోగించారు. దాంతో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో స్థానిక పోలీస్స్టేషన్కు చెందిన మహిళా ఏఎస్సై తలకు గాయమైంది. దాంతో తోటి పోలీసులు ఆమెను చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు.
ఇవి కూడా చదవండి..
అత్యంత అరుదు: ప్రత్యేక విమానంలో భారత్కు కిడ్నీ పేషెంట్..!
మాదీ అమీర్ఖాన్, కిరణ్రావు బంధం లాంటిదే..!
ఇంటర్నెట్ తెచ్చిన తంటా.. చెట్టుపై నుంచి ఉపాధ్యాయుడి బోధన..!
చేపల కోసం వల వేస్తే కొండచిలువ చిక్కింది..!
పేక మేడలా కూలి నదిలో మునిగిన ఇల్లు.. వీడియో