చెన్నై: తమిళనాడుకు చెందిన దృష్టి లోపం ఉన్న రిటైర్డ్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు కోవిల్ పిళ్ళై కరోనా కష్ణ సమయంలో అంధులకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. చెన్నైలో పలువురు అంధులకు నిత్యావసరాలతో కూడిన రేషన్ సరుకులను పంపిణీ చేశారు. “నేను గుడ్డి వాడిగా జన్మించాను, నా విద్య, ఉద్యోగంలో నా స్నేహితులు నాకు మద్దతు ఇచ్చారు. నేను 23 సంవత్సరాలు టీచర్గా పని చేసి రిటైర్ అయ్యాను. ఇప్పుడు నా వంతుగా అంధ స్నేహితులకు సహాయం చేయాలనుకుంటున్నాను” అని కోవిల్ పిళ్ళై తెలిపారు.