అహ్మదాబాద్: గుజరాత్లోని ఒక ఈటరీ షాపులో ఫాంటా డ్రింక్తో ఆమ్లెట్ తయారు చేస్తున్నారు. అయితే దీని ధర చూస్తే కంగు‘తినాల్సిందే’. సూరత్లోని భూల్కా భవన్ స్కూల్ సమీపంలోని శాంత్ వసురామ్ షాపింగ్ సెంటర్ వద్ద ఈ ఈటరీ ఉన్నది. అక్కడ ఫాంటా డ్రింక్తో ఆమ్లెట్ వేసి రూ.250కు అమ్ముతున్నారు. వినియోగదారుల డిమాండ్ మేరకు వినూత్నంగా ఫాంటాతో ఆమ్లెట్ వేస్తున్నట్లు చెఫ్ తెలిపారు. ఫుడ్ బ్లాగర్ వినయ్ రావత్ తన యూట్యూబ్ ఛానెల్ ‘ఇండియా ఈట్ మానియా’లో ఈ వీడియోను పోస్ట్ చేయగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మరోవైపు ‘ఫాంటా ఆమ్లెట్’ ధర చూసి స్థానికులు, నెటిజన్లు కంగుతిన్నారు. కొద్దిగా డ్రింక్, మూడు కోడిగుడ్లతో చేసిన ఆమ్లెట్కు అంత ధరా? అని మండిపడుతున్నారు. దీని కన్నా ఆమ్లెట్తోపాటు డ్రింక్ తాగడం బెటర్ అని కొందరు వ్యాఖ్యానించారు. ఇక గిట్టని వ్యక్తుల పార్టీలో ఇలాంటి ఆమ్లెట్ను ఆర్డర్ చేయవచ్చని మరొకరు ఫన్నీగా కామెంట్ చేశారు.