నూతన తెలుగు సంవత్సరంలో ప్రజలు సుఖఃసంతోషాలతో, ఆరోగ్యంతో ఉండాలని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ఆకాంక్షించారు. బ్రాహ్మణ సేవా వాహిని రూపొందించిన నూతన తెలుగు సంవత్సర పంచాంగాన్ని పద్మారావుగౌడ్ ఆయన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా నివారణకు ప్రభుత్వపరంగా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని, ప్రజలు కూడా జాగ్రత్తలు పాటించాలని కోరారు. ఈ తెలుగు సంవత్సరం ప్రజలు కరోనా నివారణ చర్యలు పాటిస్తూనే రోజువారీ విధులు నిర్వహించుకోవాలన్నారు. అర్హతగల ప్రతి ఒక్కరూ కచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోవాలని, వ్యాక్సిన్ వల్ల దుష్ప్రభావాలు ఉండవన్నారు. ఈ కార్యక్రమంలో నేతలు తీగుళ్ల కిరణ్కుమార్ గౌడ్, రఘు, కిరణాచార్యులు తదితరులు పాల్గొన్నారు.