బెంగళూర్ : నడిరోడ్డుపై మహిళ కుప్పకూలడంతో జేసీబీలో ఆమెను దవాఖానకు చేర్చగా అప్పటికే మరణించినట్టు వైద్యులు వెల్లడించిన ఘటన కర్నాటకలోని కోలార్ లో వెలుగుచూసింది. రోడ్డుపై మహిళ అపస్మారకస్థితిలో పడిపోయినా అటుగా వెళ్లేవారు ఎవరూ తమ వాహనాల్లో ఆమెను దవాఖానకు తీసుకువెళ్లేందుకు చొరవ చూపకపోవడంతో పాటు కనీసం అంబులెన్స్ కూ కాల్ చేయలేదు.
దీంతో ఆమె కుమార్తె జేసీబీలో తల్లిని ఆస్పత్రికి తరలించాల్సి వచ్చింది. ఆస్పత్రికి తీసుకువెళ్లగాఅప్పటికే మహిళ మరణించిందని వైద్యులు నిర్ధారించారు. ఇక కర్నాటకలో గడిచిన 24 గంటల్లో 37,773 తాజా కేసులు వెలుగుచూడగా మహమ్మారి బారినపడి 217 మంది మరణించారు.