బురేవి ఎఫెక్ట్ : కొడైకెనాల్లో భారీ ఈదురుగాలులు, వర్షం

చెన్నై : బురేవి తుపాన్ భారత ద్వీపకల్ప ప్రాంతాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గురువారం మధ్యాహ్నం నుంచి తమిళనాడులోని దిండిగుల్ జిల్లా కొడైకెనాల్లో తీవ్ర ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. సహాయ చర్యల్లో అధికారులకు తోడ్పాటు అందించేందుకు భారత నావికా దళానికి చెందిన గజఈతగాళ్లు, విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగాయి.
దక్షిణతీరంలోని జాలర్లను హెచ్చరించేందుకు, విపత్తు సహాయ చర్యలు చేపట్టేందుకు భారత నావికా దళానికి చెందిన రెండు ఓడలు, నాలుగు నేవి ఎయిర్ క్రాప్ట్లను మోహరించారు. తుపాన్ రామేశ్వరం తీరాన్ని దాటే సమయంలో భారీ ఈదురుగాలులకు జాలర్ల పడవలు పూర్తిగా ధ్వసమయ్యాయని అధికారులు తెలిపారు. తుపాన్ కారణంగా పంబన్ తీరంలో చిక్కుకుపోయిన ముగ్గురు జాలర్లను రక్షించారు. తమిళనాడులోని పంబన్-కన్యాకుమారి మధ్య గురువారం సాయంత్రం లేదా రాత్రి తుపాన్ తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ తెలిపింది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- కండ్లు చెదిరే రీతిలో.. కరిగెటలో ఫుట్బాల్ పోటీల కసరత్తు
- ఓయూ డిస్టెన్స్పై పుకార్లు నమ్మొద్దు
- నేరాలను అరికట్టేందుకు.. ‘దిల్ సే’ వలంటీర్లు
- సినీ ప్రముఖులకు జగపతి బాబు సర్ప్రైజింగ్ గిఫ్ట్స్
- సిమ్ స్వాపింగ్.. ఖాతాలు లూటీ
- సికింద్రాబాద్, కరీంనగర్ నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లు
- మద్య నిషేధం విధించండి.. బీజేపీ చీఫ్ నడ్డాకు ఉమాభారతి విజ్ఞప్తి
- రాష్ర్టంలో క్రమంగా వేడెక్కుతున్న వాతావరణం
- రూ.2.15లక్షలకే స్విఫ్ట్ డిజైర్ అంటూ బురిడీ
- రూ.50 జరిమానా సరిపోదు, కఠినంగా శిక్షించాలి: శ్రద్ధా