లక్నో: ఉత్తరప్రదేశ్లో స్థానిక ఎన్నికల సందర్భంగా శనివారం పలు చోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయి. 825 స్థానాలకు బ్లాక్ ప్రెసిడెంట్ ఎన్నికలు నిర్వహించారు. ఓటింగ్ సందర్భంగా ఎటావా జిల్లాలో హింస చెలరేగింది. కొందరు మూకుమ్మడిగా పోలింగ్ బూత్ వద్దకు వచ్చేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా ఆ గుంపు రాళ్లు విసరడంతోపాటు తుపాకీలతో కాల్పులు జరిపింది. కాగా, ఇదంతా సీసీటీవీలో రికార్డు అయ్యిందని, ఓటింగ్ ముగిసిన తర్వాత సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి దర్యాప్తు జరిపి నిందితులను అరెస్ట్ చేస్తామని ఎటావా పోలీస్ అధికారి తెలిపారు.