తన కడుపు పండిందని తెలియగానే ఆడకూతురుకు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. ఆ క్షణం నుంచి తన గురించి, కడుపులోని బిడ్డ గురించి తహతహలాడుతుంటుంది. కానీ, కాన్పు గండం ఎలా గడుస్తుందని చాలామంది ఆందోళన చెందుతూ ఉంటారు. కాన్పు తేలికయ్యే మార్గాలను అన్వేషిస్తూ ఉంటారు. ఇందుకోసం యోగాసనాలు ప్రయత్నించొచ్చు. పార్శోత్తాసనం వేయడం వల్ల వెన్నునొప్పి దూరమవ్వడంతో పాటు కాన్పుకూడా తేలికవుతుందని చెబుతున్నారు నిపుణులు. అయితే, వైద్యుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆసనం ప్రయత్నించాలి.