అమరావతి: ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా మండిపడ్డారు.’బాబుకు నొప్పి కలిగితే ఎల్లోకులమీడియా విలవిలలాడుతుంది. అమరావతి అసైన్డ్ భూములను చౌకగా కొట్టేసిన స్కాంలో ‘యజమాని’ని కాపాడేందుకు నానా తిప్పలు పడుతోంది. సంబంధం లేని వారిని బాధితులుగా చూపి తమనెవరూ మోసం చేయలేదని, ఇష్టం ప్రకారమే భూములు అమ్మామని చెప్పిస్తోందని’ విజయసాయిరెడ్డి ఆరోపించారు.
‘దళితులంటే చంద్రబాబుకు మొదటి నుంచీ చులకన, ఛీత్కారం. దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారని అన్నప్పుడే అయన నరనరాల్లో ఎంత ఏహ్య భావం దాగి ఉందో అర్థమైంది. అసైన్డ్ భూములు కొల్లగొడతాడు. గవర్నర్, రాజ్యసభ పదవులు ఎంతమందికి ఇప్పించాడో తెలుసు కదా? ఇంత మోసపు బతుకు అవసరమా బాబూ!’ అంటూ ఆయన విమర్శించారు.