అమరావతి: ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మువ్వన్నెల జెండా రూపకర్త పింగళి వెంకయ్యకు కేంద్ర ప్రభుత్వం ‘భారత రత్న’ ఇవ్వాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కోరడంపై విజయ సాయిరెడ్డి స్పందించారు.
‘పింగళి గారికి భారతరత్న ఇవ్వాలంటూ హడావుడి చేస్తున్నాడు చంద్రబాబు. ఢిల్లీలో చక్రం తిప్పానంటావ్… అప్పుడు ఏం చేశావు? మూడు వారాల కిందటే పింగళి కుమార్తె నివాసానికి స్వయంగా వెళ్లి సాయం చేశారు జగన్ గారు. భారతరత్న ఇవ్వాలంటూ ప్రధానికి 20 రోజుల క్రిందటే లేఖ రాశార’ని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.