బెంగుళూరు: కర్నాటక రాజధాని బెంగుళూరులో ఉన్న హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ( హెచ్ఏఎల్) కంపెనీ కేంద్రాన్ని ఇవాళ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ( M Venkaiah Naidu ) సందర్శించారు. తేజస్తో పాటు లైట్ కంబాట్ హెలికాప్టర్లు తయారు అవుతున్న ఉత్పత్తి కేంద్రాలను ఆయన పరిశీలించారు. అయితే ఆ సమయంలో తేజస్ యుద్ధ విమానంపై ఉపరాష్ట్రతి వెంకయ్యనాయుడు ఎక్కి కూర్చుకున్నారు. పైలట్లు కూర్చూనే సీటులో కూర్చున్న వెంకయ్యనాయుడు ఆ యుద్ధ విమాన శక్తిసామర్థ్యాలు అడిగి తెలుసుకున్నారు. హెచ్ఏఎల్ కార్యక్రమంలో కర్నాటక గవర్నర్ థావర్చాంద్ గెహ్లాట్ కూడా పాల్గొన్నారు.