కప్పేసిన పొగమంచు.. పలు రైళ్లు ఆలస్యం

న్యూఢిల్లీ : ఉత్తర భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో బుధవారం దట్టమైన పొగమంచు కమ్మేసింది. భారత వాతావరణశాఖ తెలిపిన ప్రకారం.. ఢిల్లీలోని పాలంలో బుధవారం తెల్లవారు జామున 200 మీటర్ల దృశ్యమానత నమోదైంది. పాలంతో పాటు సఫ్దర్జంగ్లో వరుసగా ఉష్ణోగ్రత 9.4, 9.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని ఐఎండీ పేర్కొంది. దట్టమైన పొగమంచు కారణంగా 13 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని ఉత్తర రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ తెలిపారు. పాలం, అమృత్సర్, లక్నో, వారణాసి, పాట్నా విమానాశ్రయాల్లోనూ తక్కువ దృశ్యమానత నమోదైందని అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. రాబోయే రెండు రోజుల్లో వాయువ్య భారతంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీలు తగ్గుతాయని ఐఎండీ పేర్కొంది. ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీలో కోల్డ్వేవ్ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని పేర్కొంది. పశ్చిమ హిమాలయ ప్రాంతంలో ఈ నెల 22 నుంచి విస్తృతంగా మంచు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే 24 గంటల్లో పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, బీహార్, రాజస్థాన్ దట్టమైన పొగమంచు ఉండే అవకాశం ఉందని, బిహార్లోనూ రాబోయే రెండు రోజుల్లో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.
తాజావార్తలు
- విజయ్ దేవరకొండకు హ్యాండ్ ఇస్తున్న స్టార్ డైరెక్టర్..?
- వాలంటీర్లు మున్సిపల్ అధికారులకు సెల్ఫోన్లు అప్పగించాలి
- గాఢ నిద్రలో ఏనుగు పిల్ల.. తల్లి ఏనుగు ఏమి చేసిందంటే..
- టీచర్కు స్టూడెంట్ ఓదార్పు.. వైరల్ అవుతున్న లెటర్
- యువకుడి వేధింపులు.. వివాహిత ఆత్మహత్య.!
- రామ్తో కృతిశెట్టి రొమాన్స్..మేకర్స్ ట్వీట్
- కుక్కల దాడిలో 22 గొర్రెలు మృతి
- పెట్రోల్ మంట: భారత విజ్ఞప్తిని పట్టించుకోని సౌదీ అరేబియా
- భృంగివాహనంపై ఊరేగిన ముక్కంటీశుడు
- జగన్కు విదేశీ జైలు తప్పదు : నారా లోకేశ్