జమ్మికుంట, జూలై 9: సంక్షేమ, అభివృద్ధి పథకాలతో అండగా నిలుస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికే మద్దతిచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తామంటూ గుమాస్తా, టైలర్స్, చిరువ్యాపారులు, టైల్స్ అండ్ మార్బుల్స్, పెయింటర్ల అసోసియేషన్లు, దాసరి కుల సంఘాలు స్పష్టం చేశాయి. ఈ మేరకు సంఘాల బాధ్యులు శుక్రవారం ఏకగ్రీవ తీర్మానాలు చేసి జమ్మికుంటలో మంత్రి కొప్పుల ఈశ్వర్కు ప్రతులను అందజేశారు. ఈ సందర్భంగా ‘జై తెలంగాణ’ ‘జై కేసీఆర్’ నినాదాలతో హోరెత్తించారు. గుమాస్తాల సంఘ భవనానికి మంత్రి రాగా, వారు స్వాగతం పలికి, సన్మానించారు. బీజేపీ నేత ఈటల రాజేందర్ తమ సంఘ భవనానికి నిధులివ్వలేదని సంఘం సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గుమాస్తాల భవన నిర్మాణానికి 20 లక్షలు మంజూరు చేస్తున్నట్లు మంత్రి కొప్పుల ప్రకటించడంతో సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఏకగ్రీవ తీర్మానం చేసి ప్రతిని గౌరవాధ్యక్షుడు పొనగంటి మల్లయ్య చేతుల మీదుగా మంత్రికి అందించారు.
తర్వాత ఎంపీఆర్ గార్డెన్స్లో టైలర్స్, చిరు వ్యాపారులు, టైల్స్ అండ్ మార్బుల్స్, పెయింటర్స్ సంఘాల నాయకులు, దాసరి కులస్తులతో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, కుల వృత్తులకు అందిస్తున్న చేయూత గురించి వివరించారు. అన్ని వర్గాలను అన్ని విధాలా ఆదుకుంటున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ఒక్కటేనని, సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణ కోసం శ్రమిస్తున్నారని స్పష్టం చేశారు. చిరు వ్యాపారుల కోసం ప్రత్యేక స్థలం కేటాయిస్తామని, మిగతా సంఘాల కోసం ప్రత్యేక కమ్యూనిటీ భవనాల కోసం కృషి చేస్తానని చెప్పారు. పేదలందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. సమస్యలన్నీ సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని, వెంటనే పరిష్కరిస్తానన్నారు. మంత్రి వెంట మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్రావు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
బ్రాహ్మణులకు అండగా ఉంటాం..
నిరుద్యోగ బ్రాహ్మణ యువతకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందిస్తున్నామని, సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వివిధ రంగాల్లో నైపుణ్యం ఉండి ఆర్థిక స్థోమత లేని బ్రాహ్మణులను ప్రోత్సహించే లక్ష్యంతో వరంగల్ హెల్ప్ సెంటర్ ద్వారా ప్రభుత్వం అందించే బెస్ట్ స్కీంకు ఏడుగురు దరఖాస్తు చేశారు. వారికి 55 లక్షల సబ్సిడీ రుణాలు మంజూరు కాగా, అందుకు సంబంధించిన పత్రాలను శుక్రవారం సాయంత్రం పట్టణంలోని శ్రీ పంచముఖ హనుమాన్ దేవాలయంలో లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం మంత్రి ఆయన మాట్లాడారు. బ్రాహ్మణులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో పాటు సమస్యలు పరిష్కరిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. తర్వాత మంత్రిని వేద బ్రాహ్మణులు ఆశీర్వదించారు. ఇక్కడ నాయకులు వల్లూరి పవన్కుమార్, హరి సీతారాం శర్మ, డింగరి రవికుమార్, దుర్గా శర్మ, వరప్రసాద్, శ్రీనివాస్రావు, ప్రసాదాచార్యులు, రతన్ శర్మ, కృష్ణ శర్మ, కల్యాణ్రామ్, విష్ణుదాసు, ఫణీందర్రావు, కిషన్చ, రాము, వినయ్ శర్మ, రాంచంద్రమూర్తి, సాయిప్రసన్న, నాగరాణి, రాధ, శోభ, అరుణ, అర్చన, నాయకులు, తదితరులున్నారు.
సీఎం కేసీఆర్ అందరినీ ఆదుకుంటున్నడు..
సీఎం కేసీఆర్ పెదల పెన్నిధి. రాష్ట్రం తెచ్చిండు. పథకాలు అమలు చేస్తుండు. ఎవరికేం కావల్నో అదే జేత్తండు. అందరినీ ఆదుకుంటున్నడు. మాకు డబుల్ బెడ్రూం ఇత్తమని అన్నడు. మా సంఘానికి నిధులిస్తున్నడు. ఇలా అడుగుతుతోటి అలా ఇత్తన్రు. ఇంకేంగావాలే. టీఆర్ఎస్తోనే ఉంటం. కేసీఆర్ ఎవల్ని బెడితే వాళ్లకే ఓటేత్తం. సంఘమంతా ఏకగ్రీవంగా తీర్మానం జేసినం. ఆ పత్రాలను మంత్రికిచ్చినం.