మెదక్ మున్సిపాలిటీ, ఏప్రిల్ 11: మహాత్మా జ్యోతిరావు పూలే సేవలు చిరస్మరణీయమని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో బీసీ సంఘం ఆధ్వర్యంలో జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలుకు చదువు నేర్పించిన ఘనత పూలేకే దక్కిందన్నారు. ఆయన ఆశయాలకు అందరూ కృషిచేయాలన్నారు. పూలే కుల, లింగ వివక్షలకు వ్యతిరేకంగా పోరాడి సమాజంలో మార్పు తీసుకువచ్చారన్నారు. అందరికీ మార్గదర్శకులుగా నిలిచిన పూలే గొప్ప మహనీయుడని కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు మెట్టు గంగరాం, వర్కింగ్ ప్రెసిడెంట్ బీమరి శ్రీనివాస్, నాయకులు గుండు మల్లేశం, సున్నం నరేశ్ పాల్గొన్నారు.
పూలే అడుగు జాడల్లో నడుచుకోవాలి
మహాత్మా జ్యోతిరావు పూలే అడుగు జాడల్లో నడుచుకోవాలని టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గంగాధర్ అన్నారు. పూలే జయంతిని పురస్కరించుకొని ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గంగాధర్ మాట్లాడుతూ బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి విశేషంగా కృషి చేసిన మహనీయుడు పూలే అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిరల్ కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు నగేశ్, మహమ్మద్, ఉమర్, మధు, నాథనియల్, శ్రీశైలం పాల్గొన్నారు.
పెద్దశంకంరంపేటలో..
మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో పూలే జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ జంగం శ్రీనివాస్, జిల్లా రైతుబంధు అధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి, తహసీల్దార్ చరన్, సర్పంచ్ సత్యనారాయణ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మురళీపంతులు, ఎస్ఐ నరేందర్, నాయకులు వంశీ, శంకర్గౌడ్, వీఆర్వో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండి…
‘సీఎం కేసీఆర్ కల నెరవేరుతున్నది’