పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ లెటర్ రైటింగ్ కాంపిటేషన్ నిర్వహిస్తున్నట్టు హైదరాబాద్ జనరల్ పోస్ట్మాస్టర్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 31-3-2021నాటికి 15 ఏండ్లు ఉన్న పిల్లలు ఈ పోటీలకు అర్హులని వివరించారు. ‘కొవిడ్-19 అనుభవం’ అంశంపై కుటుంబసభ్యులకు అవగాహన కల్పిస్తూ తమ అనుభవాన్ని లెటర్ ద్వారా వ్యక్తీకరించాలని సూచించారు. ఇంటి నుంచే ఈ లెటర్ కాంపిటేషన్లో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్ జిరాక్స్ కాపీలు జత చేయాలని తెలిపారు. ఏప్రిల్ 5 లోపు ‘నోడల్ ఆఫీసర్ ఎం.మన్మథరావు, అసిస్టెంట్ డైరెక్టర్,సీపీఎంజీ, తెలంగాణ సర్కిల్, డక్ సదన్ అబిడ్స్, హైదరాబాద్-500001’ చిరునామాకు పంపించాలని వివరించారు. పోటీల్లో పాల్గొనే వారు తప్పనిసరిగా మూడు పాస్ఫొటోలు, పూర్తి వివరాలు (పూర్తి పేరు, జెండర్, తండ్రి, తల్లి, సంరక్షకుడు, ప్రస్తుత, శాశ్వత చిరునామా, స్కూల్ పేరు) లెటర్ మొదటిపేజీలో రాయాల్సి ఉంటుందని తెలిపారు. 800 పదాలకు మించకుండా తెల్లపేపర్పై సొంత చేతి రాతతో లెటర్ రాయాలని సూచించారు. సర్కిల్ లెవల్ మొదటి బహుమతి-25వేలు, ద్వితీయ బహుమతి -10,000, తృతీయ బహుమతి-5వేలు, నేషనల్ లెవల్ మొదటి ప్రైజ్-50వేలు, ద్వితీయ-25వేలు, తృతీయ-10 వేలు ఉంటుందని తెలిపారు. వివరాలకు http://www.indiapost.gov.in లో సంప్రదించాలని సూచించారు.