చండీగఢ్: దేశ రాజధాని ఢిల్లీలోని ఎస్సీడీసీ ల్యాబ్కు మే, జూన్ నెలల్లో చండీగఢ్ పంపిన 50 ర్యాండమ్ కరోనా టెస్టింగ్ నమూనాల్లో ఆందోళనకర కరోనా వైరస్ వేరియంట్లు 35 ఉన్నట్లు కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్ పాలనా యంత్రాంగం శనివారం తెలిపింది. ఇందులో 33 డెల్టా వేరియంట్లు, ఒక డెల్టా ప్లస్ వేరియంట్, ఒక ఆల్ఫా వేరియంట్ ఉన్నట్లు వెల్లడించింది.
మరోవైపు పూణే ల్యాబ్కు తమిళనాడు తరచుగా పంపిన కరోనా టెస్టింగ్ నమూనాల్లో ఒకటి డెల్టా ప్లస్ వేరియంట్గా ధృవీకరించినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ డిప్యూటీ డైరెక్టర్ అర్జున్ కుమార్ తెలిపారు. 34 ఏండ్ల ఆ కరోనా రోగి ఏప్రిల్ 21న మరణించినట్లు వెల్లడించారు.