ముంబై: భీమా కోరెగావ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ, రెండేండ్లుగా జైలులో ఉన్న విప్లవ కవి వరవరరావు (81) ఎట్టకేలకు విడుదలయ్యారు. ముంబయిలోని నానావతి దవాఖానలో చికిత్స పొందుతున్న ఆయనకు ఆరోగ్య కారణాలరీత్యా ఇటీవల ఆరునెలల బెయిల్ లభించిన విషయం తెలిసిందే. కోర్టుకు సంబంధించిన నిబంధనలతో ఆయన విడుదల జాప్యమైంది. శనివారం అర్ధరాత్రి నానావతి దవాఖాన నుంచి వరవరరావు బయటకొచ్చారు.