వారణాసి : ఉత్తరప్రదేశ్లోని కాశీ పుణ్యక్షేత్రాన్ని సందర్శించాలనుకుంటున్న భక్తులకు వారణాసి అధికారులు ఓ విజ్ఞప్తి చేశారు. ఏప్రిల్ నెలలో భక్తులు వారణాసి పర్యటనను రద్దు చేసుకోవాలని అధికారులు కోరారు. ఆలయ నగరం వారణాసిలో కోవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. గత రెండు వారాల్లో 1266 శాతం కేసులు అధికం అయ్యాయి. ఈ నెలలో కాశీ విశ్వనాథుడిని దర్శించుకోవాలనుకుంటున్న స్వదేశీ, విదేశీ భక్తులు తమ పర్యటనను రద్దు చేసుకోవాలని జిల్లా మెజిస్ట్రేట్ కౌశల్ రాజ్ శర్మ కోరారు. కాశీ విశ్వనాథుడిని దర్శించుకునే భక్తులు ఆర్టీ-పీసీఆర్ నెగటివ్ సర్టిఫికేట్ ఉండాలన్నారు. నెగటివ్ ఉన్నావారిని ఎవరూ ఆపలేరన్నారు. వారణాసి జిల్లాలో ప్రస్తుతం 10 వేల పాజిటివ్ కేసులు ఉన్నాయి.