త్రిసూర్: ధర్మడంలో కేరళ సీఎం పినరాయి విజయన్పై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని 2017లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన వలయార్కు చెందిన ఇద్దరు మైనర్ అక్కాచెల్లెళ్ల తల్లి తెలిపారు. 2017 జనవరి 13న అక్క, మార్చి 4న చెల్లెలు తమ పూరింట్లోనే ఉరి వేసుకున్న స్థితిలో మరణించి ఉండగా కనుగొన్నారు. వారిద్దరిపై లైంగిక దాడి జరిగిందన్న ఆరోపణలు వచ్చాయి. తన కుమార్తెలకు న్యాయం చేయమని గతంలో విజయన్ను వేడుకొన్నా, పట్టించుకోలేదని ఆ బాలికల తల్లి చెప్పారు.