బెంగళూరు: ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొవిడ్-19 వ్యాక్సిన్లు ఏడాది పాటు ప్రభావం చూపుతాయని ప్రముఖ వైరాలజిస్ట్ కర్ణాటక రాష్ట్ర కొవిడ్ టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యుడు, డాక్టర్ వీ రవి అన్నారు. కొత్త వేరియంట్ వైరస్లు రాకుంటే మూడేండ్ల వరకు టీకాలు ప్రభావం చూపుతాయని వెల్లడించారు.
‘ప్రస్తుత టీకాలు కనీసం ఏడాది రక్షణ ఇవ్వగలవు. కొత్త వేరియంట్ల ప్రభావం లేకపోతే మూడేండ్ల వరకు రక్షణగా ఉంటాయి’ అని ఒక వెబినార్లో చెప్పారు. వ్యాక్సిన్ల ప్రభావంపై కచ్చితమైన గడువును నిర్ణయించడానికి మరింత పరిశోధన అవసరమన్నారు.
దేశంలో కొవిడ్-19 మూడో వేవ్ అనివార్యమని, దానిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలంటూ హెచ్చరించారు. కొత్త స్ట్రెయిన్ వైరస్లను ముందే గుర్తించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు.
‘భారతీయులకు రోగనిరోధక శక్తి అధికమని, భారత్లో రెండో వేవ్ రాదని చాలా మంది భావించారు. కానీ దేశంలో రెండో వేవ్ సృష్టిస్తున్న విలయం ఎంత ఉందో ఆచరణలో తెలుస్తూనే ఉంది. కొన్ని ఈయూ దేశాల్లో వైరస్ మూడో వేవ్, అమెరికా నాలుగో వేవ్ మొదలైంది’ అని అన్నారు.
అక్కెరకురాని ముచ్చట్లతో లాభం లేదు.. ప్రధాని మన్ కీ బాత్పై రాహుల్గాంధీ ఫైర్
ప్రియుడితో కలిసి సొంతింట్లోనే యువతి దొంగతనం
ఈఎస్ఐసీ ద్వారా ఫ్యామిలీ పెన్షన్…
IPL 2021: ఐపీఎల్ కోసం సీపీఎల్ షెడ్యూల్ మార్పు
మార్స్పై మేఘాలను చూశారా.. క్యూరియాసిటీ పంపిన అద్భుతమైన ఫొటోలు
బుల్లెట్ బైక్ కోసం వరుడి డిమాండ్.. ఊహించని షాక్ ఇచ్చిన వధువు
మళ్లీ రాజకీయాల్లోకి వస్తా.. పార్టీని గాడిలో పెడతా!
ప్రియుడితో కలిసి సొంతింట్లోనే యువతి దొంగతనం
బుల్లెట్ బైక్ కోసం వరుడి డిమాండ్.. ఊహించని షాక్ ఇచ్చిన వధువు
పీపీఈ కిట్ వేసుకొని.. కొవిడ్ పేషెంట్ మృతదేహాన్ని నదిలో పడేస్తూ.. షాకింగ్ వీడియో