పాట్నా: చిన్నారులపై పాట్నా ఎయిమ్స్ హాస్పిటల్లో కోవిడ్ టీకా ట్రయల్స్ ప్రారంభించారు. ట్రయల్స్లో భాగంగా సుమారు 525 మంది చిన్నారులకు టీకాలు ఇవ్వనున్నట్లు కోవిడ్ వ్యాక్సిన్ ట్రయల్ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ సీఎం సింగ్ తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీకాలు ఇవ్వనున్న పిల్లలకు ముందుగా ఆర్టీ పీసీర్, యాంటిజెన్ టెస్టులు నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. అయితే రెగ్యులర్గా చిన్నారుల ఆరోగ్య పరిస్థితులను సమీక్షించనున్నట్లు డాక్టర్ సీఎం సింగ్ తెలిపారు. ప్రస్తుతం దేశంలో 18 ఏళ్ల వయసు దాటిన వారికి మాత్రమే టీకాలు ఇస్తున్న విషయం తెలిసిందే. ఆ నాటి వరకు దేశవ్యాప్తంగా 22.26 కోట్ల మందికి టీకాలు ఇచ్చారు.
పాట్నా ఎయిమ్స్లో చిన్నారులకు కోవాగ్జిన్ టీకాలు ఇస్తున్నారు. పిల్లలపై ట్రయల్స్ నిర్వహించేందుకు భారత్ బయోటెక్ సంస్థకు గత మే 11వ తేదీన డీజీసీఐ నుంచి అనుమతి వచ్చింది. రెండేళ్ల నుంచి 18 ఏళ్ల మధ్య వయసున్న వారిపై ట్రయల్స్ నిర్వహించనున్నట్లు ఇటీవల నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పౌల్ తెలిపారు. ఢిల్లీలోని ఎయిమ్స్, నాగపూర్లోని మెడిట్రినా హాస్పిటళ్లలోనూ ట్రయల్స్ జరగనున్నాయి. పాట్నా ఎయిమ్స్లో ఒక్కో దశలో సుమారు 80 మంది వరకు పరీక్షించనున్నారు. ట్రయల్స్ కోసం అక్కడ రిజిస్ట్రేషన్ కూడా నిర్వహించారు. 13 ఏళ్ల పాట్నా కుర్రాడు ఈ ట్రయల్స్ కోసం తొలుత పేరును నమోదు చేశాడు.