వారానికి నాలుగు రోజులే కొవిడ్ టీకా పంపిణీ : ఢిల్లీ సీఎం

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కొవిడ్ టీకా పంపిణీకి ప్రభుత్వం అన్ని సన్నాహాలు చేసింది, ఈ మేరకు పరిస్థితిని సమీక్షించినట్లు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ కేంద్రం నుంచి ఢిల్లీకి 2.74లక్షల టీకాలు వచ్చాయని తెలిపారు. 1.2లక్షల టీకాలు ఆరోగ్య కార్యకర్తలు వేస్తామని.. ఇప్పటి వరకు 2.4లక్షల మంది కరోనా వైరస్కు వ్యతిరేకంగా టీకాలు తీసుకునేందుకు పేర్లు నమోదు చేసుకున్నారని చెప్పారు. ప్రతి వ్యక్తికి షెడ్యూల్ ప్రకారం.. టీకా రెండు డోసులు వేయనున్నట్లు చెప్పారు. ఢిల్లీ వ్యాప్తంగా 81 కేంద్రాలు ఏర్పాటు చేశామని.. క్రమంగా వాటిని 175కు.. ఆ తర్వాత వెయ్యి కేంద్రాలకు పెంచనున్నట్లు చెప్పారు. ప్రతి కేంద్రంలో వంద వ్యాక్సిన్లు ఇవ్వబడుతాయని, టీకా పంపిణీ వారంలో నాలుగు రోజులు సాగుతుందని చెప్పారు. సోమవారం, మంగళవారం, గురువారం, శనివారం రోజుల్లో వ్యాక్సినేషన్ కొనసాగుతుందని తెలిపారు. ప్రజలు ఏడాదిగా కరోనాతో ఇబ్బందులు పడుతున్నారని, టీకా రాకతో ఉపశమనం లభిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఇదిలా ఉండగా.. ఢిల్లీలో బుధవారం 375 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, 11 మంది మరణించారని ఢిల్లీ ఆరోగ్యశాఖ తెలిపింది.
తాజావార్తలు
- ఆ సీక్రెట్ అతనొక్కడికే తెలుసంటున్న నిహారిక..!
- చిరంజీవి మెగా ప్లాన్.. ఒకేసారి 2 సినిమాలకు డేట్స్..!
- బైకులు ఢీకొని ఇద్దరికి తీవ్రగాయాలు
- ఎస్పీ బాలసుబ్రమణ్యం కొత్త పాట వైరల్
- ఇక డేటా ఇన్ఫ్రా, కృత్రిమ మేధపైనే ఫోకస్
- ఆదిపురుష్ లాంఛింగ్కు టైం ఫిక్స్..!
- పవన్ కల్యాణ్ చిత్రంలో అనసూయ..?
- విద్యార్థినులకు మొబైల్ ఫోన్లు అందించిన మంత్రి కేటీఆర్
- సెస్, సర్ ఛార్జీలను కేంద్రం రద్దు చేయాలి : మంత్రి హరీశ్ రావు
- సంక్రాంతి హిట్పై కన్నేసిన సోనూసూద్..?