న్యూఢిల్లీ : వ్యాక్సినేషన్పై కేంద్రం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. జాతీయ టీకా నిపుణుల కమిటీ ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపింది. కరోనా బారిన పడిన వారు వైరస్ నుంచి కోలుకున్నాక 3 నెలలకు టీకా తీసుకోవాలని సూచించింది. అంతకుముందు ఇది 4-8 వారాలుగా ఉండేది. ఫస్ట్ డోస్ తీసుకున్నాక కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయితే 3 నెలల తర్వాత సెకండ్ డోస్ తీసుకోవాలి.
తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందిన వారు టీకా కోసం 4 – 8 వారాలు వేచి ఉండాలి. టీకా తీసుకున్న 14 రోజుల తర్వాత రక్తదానం చేయాలి. ఆర్టీపీసీఆర్ నెగిటివ్ వచ్చిన తర్వాత 14 రోజులకు కూడా రక్తదానం చేయొచ్చు. వ్యాక్సినేషన్కు ముందు కరోనా నిర్ధరణ పరీక్ష అక్కర్లేదు అని తెలిపింది. బాలింతలు కూడా టీకా తీసుకోవచ్చు అని సూచించింది. గర్భిణీలకు టీకా ఇచ్చే అంశంపై చర్చలు జరుగుతున్నాయని కేంద్రం తెలిపింది.