న్యూఢిల్లీ: కరోనా టీకా వేసుకొన్నాక కూడా వైరస్ సోకిన, దవాఖానల్లో చేరిన వారిపై ఐసీఎంఆర్ దేశవ్యాప్తంగా అధ్యయనం నిర్వహించింది. మొత్తం 677 మందిపై అధ్యయనం నిర్వహించగా 588( 86.09%) మందికి డెల్టా వేరియంట్ సోకిందని తెలిపింది. ఇలా వైరస్ బారిన పడ్డవారిలో 9.8శాతం మంది మాత్రమే దవాఖానలో చేరే అవసరం పడుతున్నదని పేర్కొన్నది. మరణాల శాతం 0.4శాతం అని వెల్లడించింది. అందువల్ల వేగంగా వ్యాక్సినేషన్ పూర్తి చేస్తే రాబోయే కాలంలో మరిన్ని వేవ్లు రాకుండా నిరోధించవచ్చని ఐసీఎంఆర్ సూచించింది. టీకా వేసుకొన్నాక.. వైరస్ సోకడంపై నిర్వహించిన తొలి సర్వే ఇదే.