డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన ఒక మంత్రి కాలు వేలికి మాస్క్ ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ రాష్ట్రంలోని అధికార బీజేపీకి చెందిన మంత్రి స్వామి యతిశ్వరానంద్ తన మాస్క్ను కాలు వేలికి తగిలించారు. ఒక సమావేశంలో పాల్గొన్న మిగతా మంత్రులు కూడా మాస్కులు ధరించలేదు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన ఈ ఫొటోపై ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు విమర్శలు గుప్పించారు. మాస్క్ ఎక్కడ ధరించాలో అన్నది ఆ మంత్రిని చూసి నేర్చుకోవాలని కాంగ్రెస్, ఆప్ నేతలు ఎద్దేవా చేశారు. మాస్కులు ధరించకుండా సమావేశమైన మంత్రులు ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారని మరో కాంగ్రెస్ నేత ప్రశ్నించారు. మాస్క్లు ధరించని మంత్రులు, మాస్క్లు ధరించని పేదలకు జరిమానా విధిస్తున్నారని విమర్శించారు.