నైనిటాల్, సెప్టెంబర్ 16: కరోనా ఉద్ధృతి నేపథ్యంలో చార్ధామ్ యాత్రపై గతంలో విధించిన నిషేధాన్ని ఉత్తరాఖండ్ హైకోర్టు గురువారం ఎత్తేసింది. రాష్ట్ర ప్రభుత్వం కొవిడ్ నిబంధనలను కఠినంగా అమలుచేస్తూ తీర్థయాత్రను నిర్వహించవచ్చని పేర్కొన్నది. పుణ్యక్షేత్రాల దర్శనానికి రోజూ పరిమితి సంఖ్యలో భక్తులను అనుమతించాలని నిబంధన పెట్టింది. సందర్శకులు కొవిడ్ నెగెటివ్ రిపోర్ట్, వ్యాక్సినేషన్ ధ్రువపత్రాన్ని చూపాల్సిందేనని ధర్మాసనం స్పష్టంచేసింది.