డెహ్రాడూన్ : కరోనా సెకండ్ వేవ్ కట్టడికి కఠిన నియంత్రణలను కొనసాగించాలని ఉత్తరాఖండ్ నిర్ణయించింది. మహమ్మారి నియంత్రణకు అమలవుతున్న కరోనా కర్ఫ్యూను జూన్ 9 వరకూ పొడిగిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం వెల్లడించింది.
నిత్యావసరాల దుకాణాలను వారానికి రెండు రోజుల పాటు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ అనుమతించడంతో పాటు, బుక్స్, స్టేషనరీ షాపులను వారానికి ఒక రోజు తెరిచే వెసులుబాటు కల్పించామని ప్రభుత్వం తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. కరోనా కర్ఫ్యూను పకడ్బందీగా మరికొన్ని రోజులు అమలు చేయాలని నిర్ణయించామని ఉత్తరాఖండ్ ప్రభుత్వ ప్రతినిధి, రాష్ట్ర మంత్రి సుబోధ్ ఉనియాల్ వెల్లడించారు.