న్యూఢిల్లీ: ఇండియన్ ఐడల్ 12వ సీజన్ విజేత పవన్దీప్ రాజన్( Pawandeep Rajan )ను ఉత్తరాఖండ్ కళలు, పర్యాటకం, సాంస్కృతికం బ్రాండ్ అంబాసిడర్గా బుధవారం నియమించారు. పవన్దీప్ తనను కలిసిన సందర్భంగా ముఖ్యమంత్రి పుష్కర్ ఇంగ్ ధామి ఈ ప్రకటన చేశారు. ఓ సాధారణ కుటుంబం నుంచి వచ్చినా సంగీత ప్రపంచంలో తన నైపుణ్యంతో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించాడు. అతడు ఉత్తరాఖండ్కు మొత్తం దేశవిదేశాల్లో పేరు ప్రఖ్యాతలు సాధించి పెట్టాడు అని సీఎం ధామి అన్నారు.
ఈ నెల 15న జరిగిన ఇండియన్ ఐడల్ షోలో విజేతగా నిలిచిన పవన్దీప్ రాజన్.. ఉత్తరాఖండ్లోని చంపావత్ ప్రాంతానికి చెందినవాడు. అద్భుతంగా పాడటంతోపాటు అన్ని సంగీత వాయిద్యాలనూ పవన్దీప్ వాయించగలడు. ఇదే అతన్ని ఇండియన్ ఐడల్లో ప్రత్యేకంగా నిలబెట్టింది.