డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి కన్యా పూజ నిర్వహించారు. నవరాత్రులలో తొమ్మిదవ రోజైన నవమి సందర్భంగా గురువారం దీనిని చేపట్టారు. డెహ్రాడూన్లోని అధికార నివాసంలో సీఎం పుష్కర్ సింగ్ ధామి తన భార్యతో కలిసి పలువురు బాలికల కాళ్లు కడిగి వారికి పూజ చేశారు. అనంతరం వారికి అల్పాహార విందు ఏర్పాటు చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు చెందిన కొందరు ముఖ్యమంత్రులు నవమి సందర్భంగా ‘కన్యా పూజ’ ఆనవాయితీని కొనసాగిస్తున్నారు.