పరిగి, మార్చి 25 : పరిగి పట్టణంలోని బాలాజీనగర్లో శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం గురువారం కన్నుల పండుగగా జరిగింది. పరిగి మాజీ సర్పంచ్ సిద్దాంతి పార్థసారథి-జానకి దంపతులు ఈ వేడుకలను నిర్వహించారు. గురువారం హోమాలు, అభిషేకాలు, సుదర్శన హోమం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అన్నదానం చేశారు.
భగవన్నామ స్మరణతో మానసిక ప్రశాంతత
భగవన్నామ స్మరణతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని తిరుపతికి చెందిన శివానందగిరిస్వామి, శంకరానందస్వామి తెలిపారు. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా భక్తులనుద్దేశించి వారు మాట్లాడుతూ మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందజేయాలన్నారు. కార్యక్రమంలో ప్రముఖ కవి డాక్టర్ భాస్కరయోగి, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, ఎంపీపీ కె.అరవిందరావు, జడ్పీటీసీ బి.హరిప్రియ, మాజీ ఎంపీపీ కల్లు శ్రీనివాస్రెడ్డి, మాజీ జడ్పీటీసీలు ఎస్పీ బాబయ్య, ఎస్పీ పద్మమ్మ, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ కె.ప్రసన్నలక్ష్మి, టీఆర్ఎస్ నాయకులు బి.ప్రవీణ్కుమార్రెడ్డి, ఆర్.ఆంజనేయులు, ఎ.సురేందర్కుమార్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మంగు సంతోష్కుమార్, కౌన్సిలర్లు, భక్తులు పాల్గొన్నారు.
శోభాయమానంగా కల్యాణోత్సవం
కడ్తాల్, మార్చి 25 : మండల పరిధిలోని రావిచేడ్ గ్రామంలో వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. గురువారం ఆలయాన్ని శోభాయమానంగా అలంకరించారు. ఉదయం భూదేవి సమేత శ్రీవారిని శుద్ధజలం, పంచామృతాలతో అభిషేకించి, ఆలయ అర్చకులు శ్రీమాన్ తిరుమల వింజమూరి రామానుజాచార్యులు, ఆదిత్యాచార్యులు, చిదంబరశర్మ, క్రాంతికుమార్ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. రంగు రంగుల పూలమాలలతో భూదేవి, వేంకటేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలను అందంగా ముస్తాబు చేశారు. అమ్మవారితోపాటు స్వామి వారికి ఆలయ ధర్మకర్త పుట్టపాక రామచందర్రావు పట్టు వస్ర్తాలు, పుస్తె మెట్టెలు బహూకరించారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య, ముత్యాల తలంబ్రాలతో శ్రీవారి కల్యాణోత్సవం అంగరంగా వైభవంగా జరిగింది.
భక్తులు స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ వేడుకలకు కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం హాజరై పూజలు చేశారు. అనంతరం ఆయనను ప్రజాప్రతినిధులు, ఆలయ నిర్వాహకులు సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్లు భారతమ్మ, లక్ష్మీనర్సింహారెడ్డి, ఎంపీటీసీలు బొప్పిడి గోపాల్, శ్రీనివాస్రెడ్డి, ఏంఈవో సర్దార్నాయక్, ఉప సర్పంచ్ వెంకటేశ్, పీఏసీఎస్ డైరెక్టర్ శ్రీనివాస్, ఆలయ కమిటీ అధ్యక్షుడు విఠలయ్యగౌడ్, ఉపాధ్యక్షుడు రంగయ్య, వార్డు సభ్యులు మల్లేశ్, పవన్, ఇందిరమ్మ, మానస, అలివేలు, ప్రమీల, రవి, విక్రాంత్, నాయకులు మహేందర్రెడ్డి, నర్సింహ, బాలకృష్ణ, యాదయ్య, మహిపాల్రెడ్డి, జైపాల్రెడ్డి, రామచంద్రయ్య, సంతోష్, రవికుమార్, లింగం, రమేశ్, శ్రీశైలం, కృష్ణయ్య, సాయికుమార్, భిక్షపతి, నర్సింహారెడ్డి, భీక్యానాయక్, రాములు, సత్తయ్య, రాఘవులు, గ్రామ పెద్దలు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు.