న్యూఢిల్లీ: స్కూళ్లు, కాలేజీలను తెరిచేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సంసిద్దమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 16వ తేదీ నుంచి 12వ తరగతి క్లాసులను తెరిచేందుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. కాలేజీలు, యూనివర్సిటీలను సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి తెరవనున్నట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. ఇంటర్ కాలేజీలను 50 శాతం కెపాసిటీతో ఓపెన్ చేసేందుకు పర్మిషన్ ఇచ్చారు. కాలేజీలు, వర్సిటీల్లో ఆగస్టు 5వ తేదీ నుంచి విద్యార్థుల ప్రవేశ ప్రక్రియ మొదలుపెట్టే విధంగా ఆదేశాలు ఇచ్చారు. కోవిడ్ వల్ల రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు బంద్ అయిన విషయం తెలిసిందే. ఇప్పటికే హిమాచల్, పంజాబ్, చత్తీస్ఘడ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఇంటర్ కాలేజీలను ఓపెన్ చేశారు.