ముజఫర్నగర్:ముజఫర్నగర్కు చెందిన 40 ఏళ్ల చిన్న వీధి వ్యాపారికి రూ.366 కోట్ల పన్ను మోసం కేసులో సంబంధముందని జీఎస్టీ అధికారులు అతడిని ప్రశ్నించారు. దీనిపై బాధితుడు స్పందిస్తూ రెండేళ్ల క్రితం చిన్న స్క్రాప్ దుకాణాన్ని నిర్వహించేవాడినని, ఆ షాపునకు జీఎస్టీ అకౌంట్ ఉందని, అయితే నష్టాలు రావడంతో దానిని మూసివేశానని చెప్పాడు.
అప్పుడు తన జీఎస్టీ ఖాతాను మూసివేయమని అధికారులను కోరానన్నాడు. వారం క్రితం అతని జీఎస్టీ ఖాతా పేరున 300 కోట్ల బిల్లులు జారీ అయ్యాయని అధికారులు చెప్పారు.