ఆసిఫాబాద్: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలోని కాగజ్నగర్ మండలం అందవెళ్లిలో కన్నతండ్రిని కొడుకు హత్యచేశాడు. శుక్రవారం ఉదయం అందవెళ్లికి చెందిన రాగులయ్య (55)ను అతని కుమారుడు గడ్డపారతో పొడిచి చంపాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ కలహాలతోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..