అయోధ్య: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇవాళ అయోధ్యలో రామ్ లల్లాకు పూజలు చేశారు. రామజన్మభూమి వద్దకు వెళ్లిన ఆయన అక్కడ ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం గత ఏడాది ఇదే రోజున భూమిపూజ జరిగింది. ఆ వేడుక జరిగి ఏడాది పూర్తి అయిన నేపథ్యంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇవాళ రామ్లల్లాను దర్శించుకున్నారు.