న్యూఢిల్లీ: కరోనా కేసుల వ్యాప్తిని నిరోధించడానికి ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఎంజీ మోటార్స్ ఇండియా ఏడు రోజుల పాటు గుజరాత్లోని హలోల్ ప్రొడక్షన్ యూనిట్లో ఉ్పత్తిని నిలిపివేయనున్నది. అందుకోసం హలోల్ యూనిట్ను మూసివేయనున్నట్లు మంగళవారం తెలిపింది.
ఇంతకుముందు ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ హీరో మోటో కార్ప్స్ కూడా దేశవ్యాప్తంగా ఆరు ఉత్పాదక యూనిట్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
హర్యానాలోని ధారుహెరా, గుర్గ్రామ్, ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు, ఉత్తరాఖండ్లోని హరిద్వార్, రాజస్థాన్లోని నీమ్రాణ, గుజరాత్లోని హలోల్లలో హీరో మోటో కార్ప్స్ సంస్థ ప్రొడక్షన్ యూనిట్లు ఉన్నాయి.
వడోదర సమీపాన గల హలోల్ ప్లాంట్ను మూసివేయాలని నిర్ణయించాం. ఏప్రిల్ 29 నుంచి మే ఐదో తేదీ వరకు కంపెనీ మూతపడి ఉంటుంది. ప్రస్తుత కష్టకాలంలో తమ సిబ్బంది సురక్షితంగా ఉండాలన్న విధానానికి కట్టుబడి ఉన్నామని ఎంజీ మోటార్స్ ఇండియా ప్రెసిడెంట్ అండ్ ఎండీ రాజీవ్ చాబా ట్వీట్ చేశారు.
హలోల్ ప్రొడక్షన్ యూనిట్ వార్షిక కార్ల తయారీ సామర్థ్యం 80 వేలు. సుమారు 2,500 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. హెక్టార్, హెక్టార్ ప్లస్, గ్లోస్టర్ వంటి ఎస్యూవీ మోడల్ కార్లను ఈ ప్లాంట్ నుంచే ఉత్పత్తి చేస్తున్నారు.
ప్రస్తుతం కరోనా రోగుల చికిత్సకు కొరత ఏర్పడిన ఆక్సిజన్ ఉత్పత్తి చేయడానికి ఎంజీ మోటార్స్ ఇండియా యాజమాన్యం.. మోకీ ఆధారిత దేవనందన్ గ్యాసెస్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నది.
పీపీఈ కిట్లో పెళ్లి.. వైరల్ వీడియో
భారత్ మమ్మల్ని వ్యాక్సిన్లు అడగలేదు: అమెరికా
తరుణ్ తేజ్పాల్పై అత్యాచార ఆరోపణల కేసు.. విచారణ మే 12కు వాయిదా
భారత్ మమ్మల్ని వ్యాక్సిన్లు అడగలేదు: అమెరికా
vaccine registration : 18 ఏళ్లు పైబడిన వారు కరోనా టీకా కోసం ఇలా రిజిస్టర్ చేసుకోండి
సరికొత్త హయబూసా.. ధర 16.4 లక్షలు
కేజీ-డీ6 శాటిలైట్ క్లస్టర్లో ఉత్పత్తి
ఎస్బీఐలో 5 వేల క్లర్క్ పోస్టులు.. దరఖాస్తులు ప్రారంభం
ఢిల్లీ ఎయిమ్స్కు చోటా రాజన్ తరలింపు
కరోనాతో సీనియర్ నటి భర్త మృతి
మహారాజా కోసం స్పైస్ జెట్ కూడా.. ఫైనాన్సియల్ బిడ్ గడువు పొడిగించాలంటూ..!
టెకీలకు ఊరట : ఉద్యోగులకు అదనంగా వేతనంతో కూడిన సెలవలు