ఇండోర్: డాటా స్టోరేజ్ యంత్రాలు, మెమొరీ చిప్స్ తయారీలో వాడే రసాయనాలు కలబంద గుజ్జులో ఉన్నట్టు ఇండోర్ ఐఐటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. మెమొరీ చిప్స్ తయారీలో ప్రస్తుతం కృత్రిమ రసాయనాలు వాడుతున్నారు. తాజా పరిశోధనలను మరింత లోతుగా జరిపితే కలబంద నుంచి మెమొరీ చిప్స్ తయారు చేసే అవకాశముందని ఐఐటీ ప్రొఫెసర్ రాజేశ్ కుమార్ అన్నారు. ఐఐటీలో ఫిజిక్స్ విభాగంలోని మెటీరియల్స్ అండ్ డివైజస్ ల్యాబ్లో పీహెచ్డీ విద్యార్థులు ఈ పరిశోధనలు నిర్వహించారు.