న్యూఢిల్లీ, జూన్ 21: కరోనాతో పాఠశాలలు మూతపడటం వల్ల చదువుల్లో విద్యార్థుల మధ్య ఏర్పడిన అంతరాన్ని భర్తీ చేసేందుకు శాటిలైట్ టీవీని ఉపయోగించుకోవాలని పార్లమెంటరీ స్థాయీసంఘం సూచించింది. బీజేపీ ఎంపీ వినయ్ సహస్రబుద్ధి అధ్యక్షతన విద్యపై ఏర్పాటైన స్థాయీ సంఘం సోమవారం ఎన్సీఈఆర్టీ, సీబీఎస్ఈ, విద్యా శాఖ అధికారులతో సమావేశమైంది. తదుపరి భేటీకి ఇస్రో అధికారులను కూడా పిలువాలని నిర్ణయించింది.