న్యూఢిల్లీ : దక్షిణ ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్ ఏరియాలోని ఓ ప్రయివేటు ల్యాబ్లో సోమవారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ల్యాబ్లో రోజుకు వెయ్యి ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఈ టెస్టులతో పాటు ఇతర వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. కానీ కొన్ని రికార్డులు, టెస్టుల కిట్లు కాలిపోయినట్లు సమాచారం. షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్నిప్రమాదం సంభవించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.