ఢిల్లీ : సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేస్తూ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) గురువారం నిర్ణయం వెలువరించింది. కొవిడ్-19 విజృంభన నేపథ్యంలో జూన్లో జరగాల్సిన పరీక్షలను అక్టోబరు 10కి వాయిదా వేసింది. ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్తో పాటు ఇతర కేంద్ర సర్వీసులకు యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ మూడు దశల్లో పరీక్షను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కాగా 27 జూన్,2021న జరగాల్సిన ప్రిలిమ్స్ను కొవిడ్ నేపథ్యంలో యూపీఎస్సీ వాయిదా వేసింది. ఈ పరీక్షను 10 అక్టోబరు,2021న నిర్వహించనున్నట్లు తెలిపింది.