న్యూఢిల్లీ : చరిత్రలో తొలిసారిగా ఎన్డీఏ(నేషనల్ డిఫెన్స్ అకాడమీ)లో ప్రవేశాలకు మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించేందుకు యూపీఎస్సీ నోటిఫికేషన్ను విడుదల చేసింది. అర్హులైన మహిళా అభ్యర్థులు ఆన్లైన్లో అక్టోబర్ 8వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. తదితర వివరాల కోసం https://upsconline.nic.in/ వెబ్సైట్ను సందర్శించొచ్చు.
ఎన్డీఏ, నావల్ అకాడమీ పరీక్షను యూపీఎస్సీ నిర్వహిస్తుంటుంది. దీనికి 15-18 ఏండ్ల వయసుతో పాటు ఇతర అర్హతలు ఉన్న అవివాహితులైన పురుష అభ్యర్థులను మాత్రమే అనుమతిస్తున్నారు. పరీక్షలో అర్హత సాధించి, శిక్షణ పూర్తిచేసుకున్న తర్వాత వారిని పర్మినెంట్ కమిషన్ అధికారిగా సర్వీసులోకి తీసుకుంటున్నారు. మహిళా అభ్యర్థులకు తగిన అర్హతలు ఉన్నా ఈ అవకాశం కల్పించడం లేదు. పిటిషన్పై విచారణ సందర్భంగా మహిళలకు ప్రవేశం కల్పించాలని సాయుధ దళాలు నిర్ణయించినట్టు కేంద్ర ప్రభుత్వం గతంలో సుప్రీంకోర్టుకు తెలిపిన విషయం తెలిసిందే.