నర్సంపేట, జూన్ 10: కరోనా కట్టడికి ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్డౌన్ జిల్లాలో కొనసాగుతున్నది. ఈ సందర్భంగా వ్యాపారులు ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ప్రజలు పట్టణాలు, మండలకేంద్రాలకు చేరుకుని తమకు కావాల్సిన వస్తు సామగ్రిని సాయంత్రం 5లోగా కొనుగోలు చేసుకుని 6 గంటల వరకు ఇండ్లకు చేరుకుంటున్నారు. నర్సంపేట పట్టణంలో సాయంత్రం 6 గంటల తర్వాత ఎలాంటి వాహనాలు రోడ్లపై తిరుగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చే వాహనచోదకులకు జరిమానాలు విధిస్తున్నారు. నర్సంపేట ఏసీపీ ఫణీందర్, డీఎస్పీ కరుణసాగర్రెడ్డి, సీఐ సతీశ్బాబు, ఎస్సై నవీన్కుమార్, ట్రైనీ ఎస్సైలు తదితరులు రోడ్లపైకి వచ్చి లాక్డౌన్ను పర్యవేక్షించారు.