తిరుమల: కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో జరుగుతున్న వార్షిక వసంతోత్సవాలు నేటితో ముగియనున్నాయి. వసంతోత్సవాల్లో భాగంగా సోమవారం స్నపనతిరుమంజనం నిర్వహించనున్నారు. సాయంత్రం ఆస్థానం కార్యక్రమం, తిరువీధుల్లో స్వామివారి ఊరేగింపు నిర్వహిస్తారు.
శ్రీవారి వసంతోత్సవాలు ఈనెల 24న ప్రారంభమయ్యాయి. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమికి ముగిసేటట్లుగా ఉత్సవాలు మూడు రోజుల పాటు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు శ్రీవారి ఆలయంలోని కల్యాణమండపంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో శ్రీవారికి అభిషేకం చేశారు. సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు ఆస్థానం, రాత్రి 7 గంటలకు స్వామి, అమ్మవార్లలను ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. ఉత్సవాల కారణంగా మూడు రోజుల పాటు కల్యాణం, ఊంజల్సేవ, బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..