పది రోజుల్లోగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ఆదేశించిన క్రమంలో ఉమ్మడి జిల్లాలో వడ్ల కొనుగోలు ఊపందుకున్నది. కేంద్రాల్లో సేకరించిన ధాన్యం ఎప్పటికప్పుడు మిల్లులు, గోదాములకు తరలుతున్నది. బస్తాల్లో ధాన్యం నింపడం, లారీల్లో ఎక్కించడం.. ఎక్కడ చూసినా ఇవే దృశ్యాలు కనిపిస్తున్నాయి. మిల్లులు, గోదాముల్లో ధాన్యం బస్తాలు పెద్దపెద్ద గుట్టలను తలపిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో కొనుగోళ్లు పూర్తయి కల్లాలు ఖాళీ అయ్యాయి.
ఫొటోగ్రాఫర్లు వరంగల్/జనగామ