లక్నో : యూపీ న్యాయమూర్తి వాహనాన్ని ఓ ఇన్నోవా పలుమార్లు ఢీకొట్టడంతో వాహనం నుజ్జునుజ్జయింది. ఈ ఘటనలో న్యాయమూర్తి త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఫతేపూర్ అదనపు జిల్లా మరియు సెషన్స్ జడ్జి మహ్మద్ అహ్మద్ ఖాన్ ప్రయాణిస్తున్న వాహనాన్ని చక్వాన్ గ్రామం సమీపంలో ఇన్నోవా ఢీకొట్టింది. ఈ ఘటనలో జడ్జి గన్మెన్కు గాయాలు కాగా వాహనం దెబ్బతింది. ఈ ఘటన నేపథ్యంలోజడ్జి కొక్రాజ్ పోలీస్ స్టేషన్లో హత్యాయత్నం ఫిర్యాదు చేశారు. రోడ్డు ప్రమాదం ముసుగులో కొందరు తనను హత్య చేసేందుకు ప్రయత్నించారని జడ్జి అహ్మద్ ఖాన్ ఆరోపించారు.
వాహనంలో తాను కూర్చున్న భాగం వైపు ఇన్నోవా పలుమార్లు ఢీకొందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. బరేలిలో 2020 డిసెంబర్లో ఓ యువకుడికి బెయిల్ నిరాకరించినందుకు తనను చంపుతామని బెదిరించారని జడ్జి ఫిర్యాదులో ప్రస్తావించారు. ఇన్నోవాను స్వాధీనం చేసుకున్న పోలీసులు కారు డ్రైవర్ను ప్రశ్నిస్తున్నారు. జడ్జి పని నిమిత్తం గురువారం ప్రయాగరాజ్కు వచ్చిన అనంతరం తిరిగి ఫతేపూర్కు వెళుతుండగా కొక్రాజ్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తన హత్యకు కొందరు కుట్ర పన్ని ఈ ఘటనకు తెగబడ్డారని జడ్జి ఆరోపించారు.